సందట్లో సడేమియాలా ఆచారి యాత్ర!

March 16, 2018


img

మంచు ఫ్యామిలీ హీరోలకు గత కొంత కాలంగా పెద్దగా టైం కలిసి వస్తున్నట్లుగా అనిపించడం లేదు. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ ఇలా ముగ్గురు కూడా హీరోలుగా వరుసగా ఫ్లాప్‌ అవుతూ వచ్చారు. ఇటీవలే గాయత్రి సినిమా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద ఢీలా పడిపోయిన మోహన్‌బాబు తర్వాత ఇప్పుడు మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఆచారి అమెరికా యాత్ర సినిమాతో మంచు విష్ణు రిపబ్లిక్‌ డే సందర్బంగానే రావాల్సి ఉంది. కాని పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు అనే ఉద్దేశ్యంతో విడుదల వాయిదా వేయడం జరిగింది. ఆ తర్వాత వరుసగా ఏదో ఒక కారణంతో సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. మార్చి చివరి నుండి పెద్ద సినిమాలు వరుసగా వస్తున్న నేపథ్యంలో మే వరకు విష్ణు అమెరికా యాత్ర ఉండే అవకాశం లేదని అంతా భావించారు. 

ఈ నేపథ్యంలోనే హడావుడిగా మంచు విష్ణు తన సినిమా ఏప్రిల్‌ 5న విడుదల చేయాలని నిర్ణయించారు. అంతకు ముందు వారమే రామ్‌ చరణ్‌ రంగస్థలం చిత్రాన్ని తీసుకు రాబోతున్నాడు. ఆ సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ను దున్నేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు. అంచనాలున్నా కూడా భయపడకుండా మంచు విష్ణు సినిమాను విడుదల చేయబోతున్నాడు. ఏప్రిల్‌ లో మహేష్‌బాబు భరత్‌ అను నేను కూడా విడుదల కాబోతుంది. రంగస్థలం మరియు భరత్‌ అను నేను చిత్రాల నడుమ మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర చిత్రం నలిగి పోవడం ఖాయం అని.. ఇలా విడుదల చేయడం కంటే మరోసారి వాయిదా వేయడం మంచిదని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



Related Post

సినిమా స‌మీక్ష