శ్రీనువైట్ల సాహసం చేస్తున్నాడా..!

March 15, 2018


img

స్టార్ హీరోలు అవకాశం ఇచ్చినా సరే సరిగా వాడుకోని డైరక్టర్ శ్రీను వైట్ల ఇప్పుడు మాస్ రాజా రవితేజతో సినిమాకు సిద్ధమయ్యాడు. మాస్ రాజా రవితేజ కళ్యాణ్ కృష్ణ నేల టికెట్ సినిమాను పూర్తి చేసి ఈ సినిమా చేయనున్నాడు. శ్రీను వైట్ల సినిమా టైటిల్ గా అమర్ అక్బర్ ఆంటోని అని పెట్టారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాకు సహ నిర్మాతగా శ్రీను వైట్ల ఉంటున్నాడని టాక్.

ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ ఓ కమిట్మెంట్ తో సినిమా చేస్తున్నారట. అను ఇమ్మాన్యుయెల్ ఓ హీరోయిన్ గా ఫైనల్ అవగా మిగతా ఇద్దరు హీరోయిన్స్ సెలెక్ట్ అవ్వాల్సి ఉంది. దర్శకుడిగా ఫెయిల్యూర్ అయిన శ్రీను వైట్ల నిర్మాతగా కచ్చితంగా హిట్ కొడతాడని అంటున్నారు. వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాల తర్వాత శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష