ఫైనల్ గా రాజికి వచ్చారు..!

February 23, 2018


img

మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు సూర్య ఇలా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకే డేట్ న వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 26న రెండు సినిమాల రిలీజ్ లు కన్ ఫాం అవగా.. దర్శక నిర్మాతలు చర్చలు జరిపినా లాభం లేకుండా పోయింది. ఇక ఫైనల్ గా ఈ మ్యాటర్ లో మెగాస్టార్ చిరంజీవి జోక్యం చేసుకున్నారని తెలిసింది. చిరు ఏమో కాని దిల్ రాజు, కె.ఎల్.నారాయణ ఈ ప్రాబ్లెం ను సాల్వ్ చేశారని తెలుస్తుంది.

అటు భరత్ అనే నేను నిర్మాత డివివి దానయ్య, ఇటు నా పేరు సూర్య నిర్మాతలు లగడపాటి శ్రీధర్, బన్ని వాసు, నాగబాబు ఈ మీటింగ్ లో ఉండగా.. ఫైనల్ గా ఏప్రిల్ 20న భరత్ అనే నేను రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇక మే 4న నా పేరు సూర్య సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. రెండు సినిమాలకు ఎలా లేదన్నా రెండు వారాల గ్యాప్ ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మీటింగ్ కు ముందే బన్ని మహేష్ లు ఫోన్ లో మాట్లాడుకున్నారని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష