టాలీవుడ్ న్యూ లక్కీ గాళ్..!

January 19, 2018


img

హీరోలెంతమంది ఉన్నా టాలీవుడ్ లో ఎప్పుడు హీరోయిన్స్ కొరత ఉంటూ వస్తుంది. నిన్నటిదాకా మలయాళ భామలతో సినిమాలు రాగా ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ కన్ను మళ్లీ ముంబై భామల మీద పడ్డది. ఇప్పటికే ప్రభాస్ సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ నటిస్తుండగా.. మహేష్ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అయిన కియరా అద్వాని మొదటి సినిమా రిలీజ్ అవకుండానే మరో లక్కీ ఛాన్స్ పట్టేసింది.

బోయపాటి శ్రీను రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈరోజు ముహుర్తపు షాట్ కొట్టగా.. త్వరలో సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్తుందట. మహేష్ పక్కన నటిస్తూ ఆ వెంటనే చరణ్ తో సినిమా ఛాన్స్ పట్టేసింది అంటే కచ్చితంగా అమ్మడు తెలుగులో టాప్ రేంజ్ కు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పేయొచ్చు.  



Related Post

సినిమా స‌మీక్ష