పాపం శ్రీలత అందుకే ఆత్మహత్య చేసుకొన్నారా?

September 22, 2017
img

తెరాస ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి (పినతల్లి కొడుకు) సోదరుడు గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత (45) నిన్న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంగతి తెలిసిందే. 

మహేందర్ రెడ్డి, శ్రీలతలకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. పిల్లలు ఇద్దరూ చక్కగా ఉన్నత విద్యలభ్యసిస్తూ చదువుల్లో చక్కగా రాణిస్తున్నారు. భర్త స్థానికంగా ఒక ప్రైవేట్ స్కూల్ నడిపించుకొంటుంటే, శ్రీలత ఇంటి పనులతో పాటు, పాడిపశువుల పనులు కూడా చేసుకొనేవారు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ తమ కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నారని, వారిది చూడ ముచ్చటైన సంసారమని అర్ధం అవుతోంది.

వారికి ఒక పౌల్ట్రీ ఫారం కూడా ఉంది. కొన్ని నెలల క్రితం పౌల్ట్రీ ఫారం పనులు చూసుకోవడానికి కేరళ యువతిని పనిలో పెట్టుకొన్నప్పటి నుంచి భార్యాభర్తల మద్య మనస్పర్ధలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆమె వ్రాసిన సూసైడ్ నోట్ లో తన భర్త తనను, పిల్లలలను నిర్లక్ష్యం చేస్తున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొన్నట్లు స్పష్టం అవుతోంది. 

ఆమె దానిలో ఏమి వ్రాసింది అంటే “ఏ తల్లైనా తన పిల్లలు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. నాలో ఏ తప్పులూ లేవు. కానీ మిమ్మల్ని ఎదిరించి బతికే ధైర్యం నాకు లేదు. నా బాధ్యత ఒక్కటే..చింటు చదువు. కానీ చింటు చదువు డిస్టర్బ్ అవుతోంది. చింటూ..నువ్వు ఎంచుకున్న మార్గం మంచిదే. నీవు బాగా చదవుకోవలనేదే నా కోరిక. ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించుకో. చింటు..మౌనిక ఇద్దరూ నన్ను క్షమించండి.’ 

Related Post