త్వరలో భగీరధ మినరల్ వాటర్ బాటిల్స్

January 22, 2021
img

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో గురువారం మిషన్ భగీరథ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ వాటర్ బాటిల్‌ను విడుదల చేశారు. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భగీరధ వాటర్ బాటిల్ నీటినే సరఫరా చేయనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఇప్పటికే మిషన్ భగీరథకు హుడ్కో మూడుసార్లు అవార్డులు ఇచ్చిందని కనుక ఈ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం మానుకోవాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్న మినరల్ వాటర్ కంటే మిషన్ భగీరథ వాటర్ అత్యంత స్వచ్చమైన, సురక్షితమైన నీరని స్మితా సబర్వాల్ అన్నారు.


Related Post