సిరిసిల్లాలో పరువు హత్య!

October 31, 2020
img

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలోను అభివృద్ధి పధంలో దూసుకుపోతుంటే పిల్లల కిడ్నాపులు, మహిళలపై అత్యాచారాలు, పరువు హత్యలు రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బోయిన్‌పల్లి మండలంలోని స్థంభంపల్లి గ్రామంలో  పరువు హత్య జరిగింది. గ్రామానికి చెందిన మహేష్, గౌతమి గత కొంతకాలంగా ప్రేమించుకొంటున్నారు. కానీ వారి ప్రేమను అమ్మాయి తల్లితండ్రులు అంగీకరించకపోవడంతో వారిరువురూ ఈనెల 25న పారిపోయి వివాహం చేసుకొని గ్రామానికి తిరిగివచ్చారు. దాంతో తీవ్ర ఆగ్రహావేశాలతో గౌతమి కుటుంబసభ్యులు మహేష్ ఇంటిపై దాడి చేశారు. ఆ దాడిలో మహేష్ తో సహా అందరూ గాయపడ్డారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మహేష్ తండ్రి లక్ష్మినారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయారు. దాంతో మహేష్ కుటుంబ సభ్యులు గౌతమి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడికి పాల్పడినవారిని అరెస్ట్ చేశారు. 


Related Post