మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ పాతబస్తీలో మీలాద్ ఉన్ నబీ ఉత్సవాలు, ఊరేగింపులు జరుగనున్నాయి. కనుక ట్రాఫిక్ పోలీసులు నేడు పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించి వాహనాలను వేరే మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనీల్ కుమార్ తెలిపారు. ఇమ్లీబన్ బస్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే బస్సులన్నీ ఇవాళ్ళ ఒక్కరోజూ చాదర్ ఘాట్, నల్గొండ క్రాస్ రోడ్ మీదుగా ప్రయాణిస్తాయని తెలిపారు. పాతబస్తీలో జరిగే ఈ ఉత్సవాలకు వచ్చేవారు తమ వాహనాలను ఛార్మినార్ బస్ టెర్మినల్లో పార్కింగ్ చేసుకోవచ్చునని సీపీ అనీల్ కుమార్ తెలిపారు. మీలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులందరికీ శుభాకాంక్షలు.