సింగరేణిలో ప్రమాదం

October 29, 2020
img

సింగరేణి భూగర్భగనిలో గురువారం సాయంత్రం ప్రమాదం జరిగింది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి వద్దగల ‘66వ లెవెల్-41 డీప్’ గనిలో పైకప్పు కూలిపోవడంతో శిధిలాల క్రింద చిక్కుకొని నవీన్ అనే ఓ కార్మికుడు చనిపోగా,మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకొన్న సింగరేణి భద్రతాసిబ్బంది వెంటనే సహాయచర్యలు చేపట్టి గాయపడిన కార్మికుల్ని వెలికితీసి ఆసుపత్రికి తరలించారు. శిధిలాల క్రింద చిక్కుకొని చనిపోయిన కార్మికుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Related Post