మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

August 11, 2020
img

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సోమవారం ఆయన హటాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురవడంతో డిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెదడులో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే బ్రెయిన్ సర్జరీ చేసి ఆ అవరోధాన్ని సరిచేశారు. కానీ ఆపరేషన్ తరువాత ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోగా మరింత వేగంగా క్షీణిస్తుండటంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చేరిన వెంటనే ఇతర పరీక్షలతో పాటు కరోనా పరీక్ష కూడా చేయగా ఆయనకు పాజిటివ్ అని తేలింది. ఆపరేషన్‌కు ముందు ప్రణబ్ ముఖర్జీ స్వయంగా తనకు కరోనా సోకిందని ట్వీట్ చేశారు.    


Related Post