మహబూబాబాద్ ఏఆర్ డీఎస్పీ శశిధర్ కరోనాతో మృతి

August 11, 2020
img

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీఎస్ శశిధర్ (50) కరోనా బారినపడి చనిపోయారు. కొన్నిరోజుల క్రితం కరోనా లక్షణాలు కనిపించడంతో వెంటనే పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. వెంటనే నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కానీ సోమవారం మధ్యాహ్నం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.  

1966 బ్యాచ్‌కు చెందిన పీఎస్ శశిధర్ మొదట బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్‌లో ఆర్‌ఎస్సైగా పోలీస్ శాఖలో చేరారు. ఆ తరువాత కరీంనగర్‌, సిరిసిల్లా జిల్లాలలో పనిచేశారు. ఫిబ్రవరి 2019లో డీఎస్పీగా పదోన్నతిపై మహబూబాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మహబూబాబాద్‌ జిలా పోలీస్ కార్యాలయంలోనే చేస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎస్పీ కోటిరెడ్డి ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.     


Related Post