హైదరాబాద్‌లో బిజెపి నేత సోదరుడు కరోనాతోమృతి

July 14, 2020
img

బిజెపి సీనియర్ నేత అంబర్‌పేట్ శంకర్ సోదరుడు సి. నర్సింగ్ రావు (67) కరోనాతో సోమవారం రాత్రి మరణించారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటే జూన్‌ 27న సికింద్రాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించి పరీక్షలు చేయగా కరోనా అని నిర్ధారణ అయ్యింది. హైబీపీ, షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్‌ ఇన్ఫెక్షన్, న్యూమోనియా తదితర సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి అప్పటికే క్షీణించింది. దాంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నప్పటికీ నర్సింగ్ రావు కోలుకోలేకపోయారు. సోమవారం రాత్రి పరిస్థితి విషమించడంతో చనిపోయారు.             


Related Post