తెలంగాణ రాష్ట్రంలో కరోనా.. లాక్డౌన్ సమస్యల కారణంగా రెక్కాడితే కానీ డొక్కాడనివారు చాలామంది నానా కష్టాలు అనుభవిస్తున్నారు. వారి సమస్యలను సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళడంతో తెల్లరేషన్ కార్డు ఉన్న పేదలందరికీ ఈనెల రేషన్లో 10 కేజీల బియ్యం ఉచితం ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. కనుక రాష్ట్రంలో రేపు ఆదివారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ డిపోలలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలవుతుందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.