బోరుబావిలో పడ్డ బాలుడు మృతి

May 28, 2020
img

మెదక్‌ జిల్లా పాపన్న పేట మండలంలోని పోడ్చన్‌పల్లి గ్రామంలో నిన్న సాయంత్రం బోరుబావిలో పడిన సంజయ్ సాయి వర్ధన్ (3) మృతి చెందాడు. ఎన్డీఆర్ఎఫ్ బృందం నిన్న సాయంత్రం నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. బోరుబావికి సమాంతరంగా ఓ గోతిని తవ్వి బావి వద్దకు చేరుకొని బోరులో ఉన్న కేసింగ్ పైపును కత్తిరించి బాలుడిని బయటకు తీశారు. వెంటనే అక్కడే సిద్దంగా ఉన్న అంబులెన్సులో బాలుడికి ఆక్సిజన్ పెట్టి మెదక్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ బాలుడు మరణించినట్లు వైద్యులు చెప్పడంతో అందరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలుడు బోరుబావిలో పడిన కొద్దిసేపటికే ఊపిరాడక చనిపోయినట్లు వైద్యులు భావిస్తున్నారు. బోరుబావిని తవ్వి పూడ్చకుండా వదిలేసిన రిగ్గింగ్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని మెదక్ రూరల్ ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు చెప్పారు. 


Related Post