ఈద్ ముబారక్

May 25, 2020
img

పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా ముస్లింలు అందరూ ఈద్-ఉల్-ఫితర్ పండుగ జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కరోనా నేపధ్యంలో ఈరోజు సామూహిక ప్రార్ధనలు చేయవద్దని, ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవద్దని, ఒకరినొకరు ఆలింగనం చేసుకోవద్దని ఢిల్లీ జమా మస్జిద్ షాహీ ఇమామ సయ్యద్ బుఖారీ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఎవరి ఇళ్ళలో వారు ప్రార్ధనలు చేసుకోవాలని కోరారు.  


Related Post