ప్రధానమంత్రి సహాయనిధికి టాటా సన్స్ రూ.1,000 కోట్లు విరాళం

March 31, 2020
img

దేశంలో వివిద రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు  కరోనా మహమ్మారిపై పోరాటంలో పాలుపంచుకొంటూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. టాటా సన్స్ రూ.1,000 కోట్లు, రిలయన్స్ సంస్థ రూ.500 కోట్లు, ఆదానీ గ్రూప్ రూ.100 కోట్లు పీఎం కేర్స్ సహాయనిధికి విరాళాలు అందజేయబోతున్నట్లు ప్రకటించాయి. కరోనానివారణకు టాటా ట్రాస్ట్స్ అదనంగా మరో రూ.500 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఇటువంటి క్లిష్టసమయాలలో ఎప్పుడూ ముందుండే ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్   పీఎం కేర్స్ సహాయనిధికి రూ.25 కోట్లు విరాళం అందజేశారు. 


Related Post