గత ఏడేళ్లుగా చాలా నిశబ్ధంగా సాగిన నిర్భయ హత్యాచార కేసు చివరిదశకు వచ్చేక రోజుకో మలుపు తిరుగుతుండటం విశేషం. ఈరోజు రాష్ట్రపతి వారికి క్షమాభిక్ష నిరాకరించడంతో ఈకేసుపై మళ్ళీ డిల్లీలోని పాటియాలా కోర్టు కలుగజేసుకొని, నిబందనల ప్రకారం 14 రోజులు గడువు ఇచ్చి ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు నాలుగురినీ ఒకేసారి ఉరి తీయాలని ఆదేశిస్తూ మళ్ళీ కొత్తగా మరో డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో నలుగురు దోషులు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాల జీవితకాలం మరో రెండువారాలు పొడిగించబడినట్లయింది.