మా కూతురుకు న్యాయం జరిగింది: దిశ తల్లితండ్రులు

December 06, 2019
img

దిశ హత్యాచార కేసులో నలుగురు నిందితులను శుక్రవారం తెల్లవారుజామున షాద్‌నగర్‌ సమీపంలో చటాన్‌పల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు వస్తున్న వార్తలపై దిశ తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తమ కుమార్తెకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నామని, తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందని దిశ తల్లితండ్రులు అన్నారు. నిందితులకు ఉరి శిక్ష పడుతుందని భావించామని కానీ పోలీసుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో వారంతట వారే శిక్ష విధించుకొన్నారని దిశ తల్లితండ్రులు అన్నారు. 

దిశ హంతకులకు నది రోడ్డుపై ఉరి తీయాలని, కాల్చి చంపాలని కోరుకొంటున్న ప్రజలు కూడా ఈ ఎన్‌కౌంటర్‌ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిందితుల తల్లితండ్రులు తమ కొడుకులకు కటినంగా శిక్షించాలని మీడియాతో అన్నప్పటికీ ఈ వార్త విని విలపిస్తున్నారు. 


Related Post