జనగామలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

November 20, 2019
img

జనగామలో పెంబర్తి గ్రామం వద్ద ఈరోజు తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని డ్డీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ఇరువురు డ్రైవర్లకు తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌ నుంచి తిరిగి వస్తుండగా పెంబర్తి గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో రోడ్డు మరమత్తు పనులు కొనసాగుతుండటంతో వనే-వేలోనే అన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అక్కడే బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని డ్డీకొట్టింది. సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఆ రెండు వాహనాలను అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం వారిని పోలీసులు హైదరాబాద్‌ తరలించారు. డ్రైవర్ల నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 


Related Post