కాచిగూడా రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ చంద్రశేఖర్ను హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుడికాలుకు పూర్తిగా రక్త ప్రసరణ నిలిచిపోవడంతో దానిని సరిచేసేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో కుడికాలును మోకాలు వరకు తొలగించినట్లు కేర్ ఆసుపత్రి తెలియజేసింది. ఈ ప్రమాదంలో పక్కటెముకలు విరిపోయాయి. ఒక కిడ్నీ కూడా పూర్తిగా దెబ్బ తిందని వైద్యులు తెలిపారు. కనుక అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అతని ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వైద్యులు తెలిపారు. తప్పనిసరి పరిస్థితులలో కుడికాలు తీసివేయవలసి వచ్చిందని తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితిపై గురువారం సాయంత్రం 4 గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని తెలిపారు.