టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

June 22, 2019
img

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన మాజీ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఉదయం 11 గంటలకు స్వామివారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ప్రమాణస్వీకారం చేస్తారు. తరువాత టీటీడీ ఛైర్మన్ హోదాలో స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం తీసుకుని అన్నమయ్య భవనంలోని టీటీడీ బోర్డు సమావేశమందిరంలో ప్రవేశిస్తారు. టిడిపి హయాంలో నియమింపబడిన టీటీడీ బోర్డు సభ్యులలో ముగ్గురు రాజీనామాలు చేయకపోవడంతో, న్యాయనిపుణుల సలహా మేరకు ఏపీ ప్రభుత్వం పాత బోర్డును రద్దు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కొట్టబోర్డు ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. త్వరలోనే బోర్డు సభ్యుల నియామకం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఒక ప్రజాప్రతినిధికి టీటీడీ బోర్డులో సభ్యునిగా తీసుకోవడం ఆనవాయితీ కనుక ఆ అవకాశం తెరాస సభ్యునికే దక్కే అవకాశం ఉంది.  


Related Post