హజ్ యాత్రకు ఎంత చెల్లించాలంటే..

May 21, 2019
img

హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్ళబోతున్న హజ్ యాత్రికులు చెల్లించవలసిన సొమ్ము ఎంతో ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి వెళుతున్న 1,430 మంది యాత్రికులలో నాన్ కుకింగ్, నాన్ ట్రాన్స్ పోర్టు జోన్‌(ఎన్‌సీఎన్‌టీజెడ్‌)లో దరఖాస్తు చేసుకొన్నవారు ఒక్కొక్కరూ రూ.2,77,750 చెల్లించాలి. అజీజియాలో వసతి కోసం దరఖాస్తు చేసుకొన్న1,105 మంది ఒక్కొక్కరూ రూ.2,40,700 చెల్లించాలి. బెంగళూరు నుంచి ఎన్‌సీఎన్‌టీజెడ్‌లో వెళుతున్న 62 మంది ఒక్కొక్కరూ రూ.2,90,150 చెల్లించాలి. అజిజియాలో వసతి కోసం దరఖాస్తు చేసుకొన్న మిగిలిన 395 మంది ఒక్కొక్కరూ రూ.2,53,100 చెల్లించాలి. ఖర్బానీ కోసం అదనంగా మరో రూ.9,150 చెల్లించాలి. ఇప్పటికే కొంత మొత్తం చెల్లించినవారందరూ మిగిలిన మొత్తాన్ని జూలై 4లోపుగా చెల్లించాలని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా కోరింది. మరిన్ని వివరాలకు హజ్ కమిటీ అధికారిక వెబ్ సైటు: http://hajcommittee.gov.in/ లో లభిస్తాయి.  

Related Post