నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

February 17, 2018
img

నేటి నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంబం అయ్యాయి. నేటి నుంచి ఈ నెల 27వరకు జరుగుతాయి. ఈ ఏడాది కూడా బాలాలయంలోనే ఈ ఉత్సవాలు జరపాలని ఆలయ పాలకమండలి నిర్ణయించినందున అక్కడ రోజూ జరిగే నిత్యకళ్యాణాలు, ఆర్జిత సేవలను నేటి నుంచి 27వరకు నిలిపివేయబడ్డాయి. ఈ నెల 24న జరుగబోయే స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కెసిఆర్ దంపతులు హాజరవుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కెసిఆర్ స్వామివారికి, అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించుకొంటారు. ఈ నెల 23న ఎదుర్కోళ్ళు, 24న తిరుకళ్యాణ మహోత్సవం, 25న దివ్య విమాన రధోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి.          


Related Post