కెసిఆర్ ప్రాజెక్టు పర్యటన వివరాలు

December 08, 2017


img

ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి తదితర ప్రాంతాలలో ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ఈరోజు కూడా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు రామగుండం నుంచి కొద్ది సేపటి క్రితమే బయలుదేరారు. మొదట మేడారం పంప్ హౌస్ 6వ ప్యాకేజీ పనులను పరిశీలిస్తారు. తరువాత మధ్యాహ్నం 12.30 గంటలకు రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ చేరుకొని అక్కడ కాళేశ్వరం గ్రావిటీ కాలువ సొరంగం పనులను పరిశీలిస్తారు. భోజన విరామం అనంతరం స్థానిక అధికారులతో ఆ ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తరువాత జగిత్యాలలోని మల్యాల మండలంలో రాంపూర్ చేరుకొని అక్కడ పంప హౌస్ నిర్మాణ పనులను, తరువాత మిడ్ మానేరు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం హెలికాఫ్టర్ లో హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతారు. 



Related Post