ముఖ్యమంత్రి కెసిఆర్ శుక్రవారం యాదాద్రి ఆలయానికి వెళ్ళబోతున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 11.35కు ఆలయం చేరుకొని స్వామివారిని దర్శించుకొంటారు. అనంతరం యాదాద్రి ఆలయం ముఖమండపంలో కాకతీయ స్థంభం అమర్చే పనులకు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. తరువాత ఆలయ పరిసరాలలో జరుగుతున్న అభివృద్ధిపనులపై దేవాలయ అధికారులతో సమీక్షిస్తారు. సాయంత్రం 3 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ తిరుగుప్రయాణం అవుతారు.