రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితకధ ఆధారంగా సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణా రాష్ట్రంలో ప్రదర్శనకు అనుమతించవద్దని కోరుతూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం ఒక లేఖ వ్రాశారు. ఆ సినిమాలో రాణీ పద్మావతి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయని, వాటితో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, కనుక ఆ సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధం విదించాలని రాజా సింగ్ తన లేఖలో కోరారు.
దీపికా పడుకొనే ప్రధానపాత్ర చేసిన ఈ సినిమాను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించదానికి నిరాకరించడంతో కొన్ని రాష్ట్రాలలో హైకోర్టులో ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కేరళలో పద్మావతి సినిమా ప్రదర్శనకు కేరళ హైకోర్టు అనుమతించింది.