పద్మావతిని తెలంగాణాలో అనుమతించవద్దు!

November 21, 2017


img

రాజస్థాన్ మహారాణి పద్మావతి జీవితకధ ఆధారంగా సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణా రాష్ట్రంలో ప్రదర్శనకు అనుమతించవద్దని కోరుతూ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కెసిఆర్ కు మంగళవారం ఒక లేఖ వ్రాశారు. ఆ సినిమాలో రాణీ పద్మావతి వ్యక్తిత్వాన్ని కించపరిచేవిధంగా సన్నివేశాలు ఉన్నాయని, వాటితో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, కనుక ఆ సినిమాను రాష్ట్రంలో ప్రదర్శించకుండా నిషేధం విదించాలని రాజా  సింగ్ తన లేఖలో కోరారు. 

దీపికా పడుకొనే ప్రధానపాత్ర చేసిన ఈ సినిమాను మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. దీనిపై సుప్రీం కోర్టు స్టే విధించదానికి నిరాకరించడంతో కొన్ని రాష్ట్రాలలో హైకోర్టులో ఈ సినిమాను వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కేరళలో పద్మావతి సినిమా ప్రదర్శనకు కేరళ హైకోర్టు  అనుమతించింది.



Related Post