తెరాస ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి తమ్ముడు గుత్తా మహేందర్ రెడ్డి భార్య శ్రీలత (45) ఆత్మహత్య చేసుకొన్నారు. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో తమ నివాసంలో ఆమె నిన్న రాత్రి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె వ్రాసిన సూసైడ్ నోట్ లో పిల్లల చదువుల విషయంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నట్లు వ్రాశారు. అయితే తన చావుకు ఎవరూ కారణం కారని స్పష్టంగా పేర్కొన్నారు.
ఆమె భర్త గుత్తా మహేందర్ రెడ్డి స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలను నడిపిస్తున్నారు. భార్యభర్తల మద్య ఎటువంటి గొడవలు లేవని స్థానికులు తెలిపారు.
ఈ విషయం తెలియగానే గుత్తా సుఖేందర్ రెడ్డి అయన మరో సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి ఉరుమడ్ల గ్రామం చేరుకొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీలత శవాన్ని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.