హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి

January 25, 2021


img

తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు బి కొండా రెడ్డి అధ్యక్షతన ఆదివారం దక్షిణాది రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైర్మన్ల వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలవారు ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే చాలా వ్యయప్రయాసలవుతున్నాయని కనుక దక్షిణాది రాష్ట్రాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అన్నారు. దీని కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ శాసనసభలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని కొండారెడ్డి అన్నారు.



Related Post