సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఇవాళ్ళ మళ్ళీ సిఎం కేసీఆర్, టిఆర్ఎస్లపై ట్విట్టర్లో బాణాలు సందించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బలంగా తయారవుతున్న ప్రధాన ప్రత్యర్ధి (?)ని ఎదుర్కొలేకనే నగరంలో శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడబోతోందని సిఎం కేసీఆర్ కొత్త డ్రామా మొదలుపెట్టారని విజయశాంతి ఆరోపించారు. తద్వారా చివరి నిమిషంలో ప్రత్యర్ధి పార్టీ (?) అభ్యర్ధులను పోటీ నుంచి తప్పించి టిఆర్ఎస్ను గెలిపించుకోవాలని యత్నిస్తునారని ఆరోపించారు. మజ్లీస్ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వారిని నియంత్రించడానికి యత్నిస్తున్న పార్టీ నేతలను శాంతిభద్రతల పేరుతో లోపలవేయాలని ఎందుకు ఆలోచిస్తున్నారని విజయశాంతి ప్రశ్నించారు.
ఆమె ఏమన్నారో ఆమె మాటలలోనే...