జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో 1,121 మంది అభ్యర్ధులు

November 23, 2020


img

జీహెచ్‌ఎంసీలో గల 150 డివిజన్లకు డిసెంబర్‌ 1వ తేదీన ఎన్నికలు జరుగుబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసేసరికి మొత్తం 1,121 మంది ఎన్నికల బరిలో మిగిలారు. ఈసారి హటాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో పార్టీలకు అభ్యర్ధులను ఖరారు చేసుకొనేందుకు తగినంత సమయం లభించలేదు. దాంతో ఆశావాహులు అందరూ నామినేషన్లు వేసుకోవాలని, వారిలో ఎంపిక చేసినవారికి బీ-ఫారంలు ఇస్తామని పార్టీలు చెప్పడంతో ఈసారి 150 స్థానాలకు 2,900 మంది నామినేషన్లు వేశారు. వాటిలో తిరస్కరణ, ఉపసంహరణలు పోగా ప్రస్తుతం 1,121 మంది బరిలో మిగిలారు. వారిలో టిఆర్ఎస్‌ 150, కాంగ్రెస్‌ 150, బిజెపి 150, టిడిపి 105, మజ్లీస్‌ 50 కాగా మిగిలినవారిలో గుర్తింపు పొందిన రాజకీయపార్టీలకు చెందినవారు, స్వతంత్ర అభ్యర్ధులు ఉన్నారు. 



Related Post