సిఎం కేసీఆర్ నేడు జనగామ జిల్లాలోని కొడకండ్లలో గ్రామంలో నిర్మించిన రైతువేదికను ప్రారంభించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టరులో బయలుదేరి 12 గంటలకు కొడకండ్లకు చేరుకొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు రైతువేదిక భవనాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఆ సమీపంలోనే అభివృద్ధి చేసిన పల్లె ప్రకృతివనాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన్న రామవరం గ్రామం చేరుకొని అక్కడ నిర్మిస్తున్న వైకుంఠధామం, డంపింగ్ యార్డు పనులను సిఎం కేసీఆర్ పరిశీలిస్తారు. మళ్ళీ కొడకండ్ల తిరిగివచ్చి అక్కడ బహిరంగసభలో రైతులను ఉద్దేశ్యించి ప్రసంగిస్తారు. సభ ముగియగానే మళ్ళీ హెలికాఫ్టరులో బయలుదేరి హైదరాబాద్ చేరుకొంటారు. ఈరోజు కొడకండ్లలో జరుగబోయే బహిరంగసభలో రాష్ట్రవ్యాప్తంగా రైతువేదికలను ఎందుకు నిర్మిస్తున్నారు?వాటిని ఏవిధంగా వినియోగించుకోవాలి? ప్రణాళికాబద్దంగా పంటలు పండించడం తదితర అంశాల గురించి సిఎం కేసీఆర్ మాట్లాడనున్నారు.