దుబ్బాక ఉపఎన్నికలకు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు డబ్బు పంచిపెడుతున్నాయని అధికార టిఆర్ఎస్ పరస్పర ఆరోపణలు చేసుకొంటుండటంతో, కేంద్ర ఎన్నికల కమీషన్ దుబ్బాక ఉపఎన్నికల పర్యవేక్షణకు తమిళనాడుకు చెందిన ఐపిఎస్ అధికారి సరోజ్ కుమార్ను ప్రత్యేక అధికారి (స్పెషల్ ఆఫీసర్)గా నియమించింది. ఉపఎన్నికలలో ఆయన కేంద్ర ఎన్నికల కమీషన్ తరపున పరిశీలకుడిగా వ్యవహరిస్తారు.