భారత్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ శస్త్రచికిత్స తరువాత మళ్ళీ కోలుకొన్నారు. ఆయనకు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో న్యూఢిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వెంటనే ఆయనకు యాంజియో ప్లాస్టీ శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కపిల్ దేవ్ ఇవాళ్ళ కోలుకోవడమే కాక ఆ విషయం ట్విట్టర్ ద్వారా తన బందుమిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు తెలియజేశారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన వారందరికీ ఆయన ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు. శస్త్రచికిత్స తరువాత ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని రెండు మూడు రోజుల్లోనే ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేస్తామని వైద్యులు తెలిపారు.