తెలంగాణకు ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్ విరాళాలు

October 20, 2020


img

భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్న తెలంగాణ రాష్ట్రానికి ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు విరాళాలు అందజేశాయి. ఢిల్లీ ప్రభుత్వం రూ.15 కోట్లు, కేరళ ప్రభుత్వం రూ.10 కోట్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రూ.2 కోట్లు విరాళాలు అందజేశాయి. ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవడంలో తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలబడతామని ముగ్గురు ముఖ్యమంత్రులు చెప్పారు. సిఎం కేసీఆర్‌ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమ కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తోంది.     



Related Post