కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కరోనా!

August 03, 2020


img

కేంద్రహోంమంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఇద్దరూ కరోనా బారినపడ్డారు. కేంద్రహోంమంత్రి అమిత్ షాకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆదివారం పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో ఆయన వైద్యుల సూచన మేరకు న్యూఢిల్లీలోని మేదాంత హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఈవిషయం ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రజలకు తెలియజేశారు. “నాకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ ఐసోలేషన్‌లోకి వెళ్ళి  కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని ట్వీట్ చేశారు.   

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా బెంగళూరులో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు ట్వీట్ చేశారు. ఆయన కూడా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని ట్వీట్ చేశారు. 

కేంద్రహోంమంత్రి అమిత్ షా తరచూ ప్రధాని నరేంద్రమోడీని, ఇతర కేంద్రమంత్రులను, అధికారులను కలుస్తుంటారు. అలాగే కేంద్రమంత్రివర్గ సమావేశానికి కూడా హాజరయ్యే ఉంటారు. కనుక ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీతో సహా వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విషయంలో కూడా అలాగే జరిగి ఉంటుంది కనుక ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఏర్పడిందని భావించవచ్చు. కనుక వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోక తప్పదు.


Related Post