నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లేక నలుగురు మృతి?

July 10, 2020


img

నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ లేక నలుగురు రోగులు మృతిచెందినట్లు తాజా సమాచారం. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలెండర్లు లేకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు కరోనా రోగులు, జనరల్ వార్డులో మరొక రోగికి ఆక్సిజన్ అందకపోవడంతో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2 గంటలకు మరణించినట్లు సమాచారం. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయారని ఆరోపిస్తూ వారి బందువులు ఆసుపత్రి ముందు ధర్నా చేయగా, సమాచారం అందుకొన్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితి అదుపుతప్పకుండా నియంత్రించారు. చనిపోయిన నలుగురు వ్యక్తులు నిజామాబాద్‌కు చెందినవారే. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఇంకా స్పందించవలసి ఉంది. 



Related Post