చిరకాలం పేరు నిలిచిపోవాలనే కూల్చుడు...కట్టుడు: రాజాసింగ్

July 07, 2020


img

ఘోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సిఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు నిజాం నవాబులు తమ పేర్లు శాస్వితంగా నిలిచిపోవాలని ఛార్మినార్, అసెంబ్లీని నిర్మించారు. నిజాం నవాబుల లక్షణాలు పుణికిపుచ్చుకొన్న కేసీఆర్‌ కూడా అదే కోరికతో సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది కట్టిస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసినట్లు చెపుతున్న కొత్త సచివాలయం డిజైన్ ఓ మసీదు లేదా హజ్ హౌసులా ఉంది తప్ప తెలంగాణ చరిత్రకు, సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టేలా లేదు. బహుశః ఓవైసీలు ఆ ప్లాన్ గీసిచ్చారేమో? ఒక పక్క కరోనాతో ప్రజలు చనిపోతుంటే, సిఎం కేసీఆర్‌ సచివాలయం కూల్చుడు... కట్టుడు పని పెట్టుకొన్నారు. ప్రజల ప్రాణాల కంటే సిఎం కేసీఆర్‌కు సచివాలయమే ముఖ్యమా? అని ప్రశ్నించారు.     



Related Post