రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

June 01, 2020


img

మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఎం కేసీఆర్‌, తదితరులు గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులు ఆర్పిస్తారు కనుక రేపు ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు గన్‌పార్క్‌, రాజ్‌భవన్‌ రోడ్, రవీంద్రభారతి, నాంపల్లి ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నాట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. సిఎం కేసీఆర్‌ రేపు ఉదయం 8గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి గన్‌పార్క్‌కు చేరుకొని అక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తరువాత తిరిగి ప్రగతి భవన్‌ చేరుకొంటారు. అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 

కరోనా నేపధ్యంలో ఎటువంటి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రేపు జెండాలు ఎగురవేయడంతో సరిపెడతారు. 



Related Post