ఒక్కరోజే తెలంగాణలో 196 కొత్త కేసులు!

June 01, 2020


img

తెలంగాణలో ఆదివారం ఒక్కరోజే 196 కొత్త కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఈసారి కూడా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 122, రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు బయటపడ్డాయి. జిల్లాలలో కూడా క్రమంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం మేడ్చల్‌లో 10,  ఖమ్మంలో 9, మహబూబ్‌నగర్‌,జగిత్యాల్, మెదక్‌ జిల్లాలో చెరో 3 కేసులు, వరంగల్‌ అర్బన్‌లో 2, సూర్యాపేట, నిర్మల్, యాదాద్రి భువనగిరి, జనగావ్ జిల్లాలో చెరో ఒకటి చొప్పున పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో కరోనారహిత జిల్లాలసంఖ్య 28 నుంచి ఒకేసారి 14కి తగ్గిపోయింది. ఆదివారం మరో ముగ్గురు వలస కార్మికులకు కరోనా సోకడంతో వారి సంఖ్య 183కి చేరింది. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌ ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో వలస కార్మికులు, విదేశాల నుంచి తిరిగివచ్చినవారితో కలిపి మొత్తం 2,698కి చేరింది. ఇప్పటి వరకు 1,428 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకోగా, మరో 1,188 మంది చికిత్స పొందుతున్నారు. నిన్నటి వరకు మొత్తం 82 మంది కరోనాతో మృతి చెందారని తెలిపింది. 



Related Post