అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేదం ఎత్తివేత

June 01, 2020


img

అంతరాష్ట్ర ప్రయాణాలపై నిషేదం ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అంతర్ రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ బస్ సర్వీసులపై మరికొన్ని రోజులు నిషేధం కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ సొంత వాహనాలు లేదా టాక్సీలలో ఎటువంటి అనుమతులు లేకుండా తెలంగాణ రాష్ట్రంలోకి రాకపోకలు సాగించవచ్చు. కేంద్రం సూచించినట్లుగా రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫూ కొనసాగుతుంది కనుక ఆ సమయంలో ప్రైవేట్ వాహనాలను కూడా రోడ్లపై అనుమతించరు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గం ద్వారా తెలంగాణలో ప్రవేశిస్తున్నవారికి సరిహద్దుల వద్దే ధర్మల్ స్కానింగ్ చేసి కరోనా లేదని నిర్ధారించుకొన్నాకనే అనుమతిస్తారు. ఒకవేళ కరోనా లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా క్వారెంటైన్‌కు వెళ్ళవలసి ఉంటుంది. రాష్ట్రంలో కంటెయిన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో దుకాణాలు రాత్రి 8 గంటల వరకు కరోనా జాగ్రత్తలన్నీ పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవచ్చు.   



Related Post