తెలంగాణలో 41 కొత్త కేసులు నమోదు

May 25, 2020


img

తెలంగాణలో ఆదివారం 41 కొత్త కేసులు నమోదయ్యాయి. వాటిలో జీహెచ్‌ఎంసీలో 23 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో ఒకరికి, ఇటీవల విదేశాల నుంచి వచ్చినవారిలో 6మందికి, 11 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దాంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,854కి చేరింది. ఆదివారం 24 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు 1,092 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. మరో 709 మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 53 మంది కరోనా బారినపడి చనిపోయారు.  

రాష్ట్రంలో వరంగల్‌ రూరల్, వనపర్తి, యాదాద్రి జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మరో 25 జిల్లాలలో గత 14 రోజులలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో తెలియజేసింది.



Related Post