కరోనాపై ట్వీట్...ఉద్యోగం ఊడింది

March 28, 2020


img

యావత్ ప్రపంచదేశాల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి ఏవిధంగా బయటపడాలని ఆందోళన చెందుతుంటే ఉన్నత చదువులు చదివి బెంగళూరులోని ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకొన్న ముజీబ్ మహమ్మద్ అనే ఉద్యోగి “దగ్గుతూ తుమ్ముతూ బయటకు వెళ్ళండి..కరోనాను వ్యాపింపజేయండి,” అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ విషయాన్ని ఆ సంస్థ యాజమాన్యానికి తెలియజేశారు. ఆ సంస్థ కూడా దానిపై అంతర్గత విచారణ జరిపి అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ మెసేజ్ పోస్ట్ చేశారని నిర్ధారించుకొని ఉద్యోగంలో నుంచి తొలగించింది.      



Related Post