యావత్ ప్రపంచదేశాల ప్రజలు కరోనా మహమ్మారి నుంచి ఏవిధంగా బయటపడాలని ఆందోళన చెందుతుంటే ఉన్నత చదువులు చదివి బెంగళూరులోని ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకొన్న ముజీబ్ మహమ్మద్ అనే ఉద్యోగి “దగ్గుతూ తుమ్ముతూ బయటకు వెళ్ళండి..కరోనాను వ్యాపింపజేయండి,” అంటూ ఓ మెసేజ్ పోస్ట్ చేశాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆ విషయాన్ని ఆ సంస్థ యాజమాన్యానికి తెలియజేశారు. ఆ సంస్థ కూడా దానిపై అంతర్గత విచారణ జరిపి అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ మెసేజ్ పోస్ట్ చేశారని నిర్ధారించుకొని ఉద్యోగంలో నుంచి తొలగించింది.