ట్రంప్ విందుకు డా.మన్మోహన్ డుమ్మా!

February 25, 2020


img

భారత్‌ పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దంపతుల గౌరవార్ధం మంగళవారం రాత్రి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాష్ట్రపతి భవన్‌లో వారికి విందు ఇవ్వనున్నారు. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు ప్రధాన ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తుంటుంది కేంద్రప్రభుత్వం. కానీ ఈసారి ఆ ఆనవాయితీని పక్కన పెట్టి కొందరు ఎంపికచేసిన ప్రముఖులనే ఆహ్వానించడంతో ప్రతిపక్షాలు కేంద్రంపై గుర్రుగా ఉన్నాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా పిలవలేదు కానీ మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌ను మాత్రం ట్రంప్‌తో విందుకు ఆహ్వానించారు. తమ పార్టీ అధినేతను ఆహ్వానించకుండా తనను ఆహ్వానించడాన్ని తప్పు పట్టిన ఆయన ఈ విందుకు తాను హాజరుకాబోనని తెలియజేస్తూ రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందించారు. ఈరోజు విందుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందడంతో ఆయన సాయంత్రంలోగా డిల్లీ చేరుకోనున్నారు.    



Related Post