సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో బాంబు ఉందని, అది సరిగ్గా అర్ధరాత్రి పేలుతుందని ఒక గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం రాత్రి పోలీస్ కంట్రోల్కు ఫోన్ చేసి హెచ్చరించడంతో, ఆర్పీఎఫ్, పోలీసులు, బాంబు స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్స్ హుటాహుటిన రైల్వేస్టేషన్కు చేరుకొని రైల్వేస్టేషన్లో అన్ని ప్లాట్ఫారంలను, వాటిపై నిలిచి ఉన్న రైళ్ళలోను, ప్రయాణికుల బ్యాగులను తనికీలు చేశారు. కానీ ఎక్కడా బాంబు కానీ ఎటువంటి అనుమానాస్పద వస్తువులు గానీ కనిపించకపోవడంతో ఇది ఎవరో అకతాయిల ఉత్తుత్తి బెదిరింపు అయ్యుండవచ్చని భావిస్తున్నారు. గోపాలాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. సనత్నగర్ ప్రాంతం నుంచి ఆ కాల్ వచ్చినట్లు కనుగొన్నారు. ఆ వ్యక్తిని పట్టుకుంనేందుకు గాలింపు మొదలుపెట్టారు.