కోటిమంది ట్రంప్‌కు స్వాగతం పలకాలంటే.. వర్మ

February 22, 2020


img

తన సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ పాపులర్ అయిన దర్శకుడు రాంగోపాల్ వర్మ త్వరలో భారత్‌ పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్‌ బాణం సందించారు. ఈనెల 24న డొనాల్డ్ ట్రంప్ దంపతులు అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు తమకు 10 మిలియన్లు (కోటి)మంది స్వాగతం పలకనున్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పడంపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ, “ఒకవేళ ట్రంప్ చెప్పుకొన్నట్లు ఆయనకు కోటిమంది స్వాగతం పలకాలంటే, ఆయన పక్కన అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్, రజనీకాంత్,కత్రీనాఖైఫ్, దీపికా పడుకొనే, సన్నీ లియోన్ నిలబవలసిందే,” అని ట్వీట్ చేశారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనేందుకు కేంద్రప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, అహ్మదాబాద్ మునిసిపల్ అధికారులు చేస్తున్న అనవసరపు హడావుడిపై ఇప్పటికే నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రాంగోపాల్ వర్మ కూడా బాగానే చురక అంటించారు. అది సోషల్ మీడియాలో ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది.   



Related Post