నిర్భయ దోషుల చివరిచూపులా...డౌటే

February 22, 2020


img

నిర్భయ దోషులకు మార్చి 3వ తేదీ ఉదయం 6గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని డిల్లీ, పటియాలా హౌస్ కోర్టు మళ్ళీ తాజా డెత్ వారెంట్ జారీ చేయడంతో, మళ్ళీ పద్దతి ప్రకారం అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు. నలుగురు దోషులలో ముఖేష్ కుమార్ సింగ్, పవన్ గుప్తా ఇద్దరూ తమ కుటుంబ సభ్యులను కొన్ని రోజుల క్రితమే జైల్లో కలుసుకున్నారు కనుక మిగిలిన ఇద్దరు దోషులు అక్షయ్ కుమార్‌, వినయ్ కుమార్‌ శర్మలను చివరిసారిగా చూసేందుకు తీహార్ జైలుకు రావాలని వారి కుటుంబ సభ్యులకు సమాచారం పంపారు. ఉరిశిక్ష అమలుకు రెండు రోజుల ముందుగానే తలారిని తీహార్ జైలుకు పంపాలని జైళ్ళ శాఖ అధికారులకు లేఖ వ్రాశారు. ప్రతీసారి ఇలాగే పటియాలా  కోర్టు డెత్ వారెంట్ జారీ చేయడం, ఆఖరి నిమిషంలో నలుగురు దోషులలో ఎవరో ఒకరు ఏదో కోర్టులో ఓ పిటిషన్‌ వేయడం, దాంతో ఉరిశిక్ష వాయిదాపడటం జరుగుతోంది. కనుక ఈసారైనా వారికి ఉరిశిక్ష అమలవుతుందా లేదా? అనేది అనుమానమే.      



Related Post