మంచిర్యాలలో నేటి నుంచి సిపిఐ మహాసభలు

February 22, 2020


img

మంచిర్యాల పట్టణంలో నేటి నుంచి మూడు రోజులు సిపిఐ రాష్ట్ర స్థాయి మహాసభలు జరుగనున్నాయి. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ మహాసభలను ప్రారంభిస్తారు. ఈ సభలలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి, అజీజ్ పాషా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 400 మంది సిపిఐ నేతలు, వేలాదిమంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ఈ మహాసభలలో చివరిరోజున అంటే సోమవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నుకొంటారు. మళ్ళీ చాడా వెంకటరెడ్డినే రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఈ మహాసభల ద్వారా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల గురించి ప్రజలకు వివరించి వాటిని ఎదుర్కొనేందుకు సిపిఐ పార్టీ ఏవిధంగా కృషి చేస్తోందో తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసుకోవడం, రాష్ట్ర స్థాయి పార్టీకి సంబందించిన అంశాలపై ఈ మహాసభలలో చర్చించనున్నారు. 



Related Post