ఊహించినట్లుగానే మునిసిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. ఉదయం 10 గంటల వరకు లెక్కించిన ఓట్లలో టిఆర్ఎస్ పలుస్థానాలు దక్కించుకోగా, మజ్లీస్ పార్టీ నిర్మల్ జిల్లా భైంసా మునిసిపాలిటీ పరిధిలో 26వ వార్డులో 4 స్థానాలు గెలుచుకొంది. కీలకమైన రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కూడా రెండు స్థానాలు గెలుచుకొంది. ఆదిభట్ల మునిసిపాలిటీ పరిధిలో 15వ వార్డులో 2 స్థానాలు గెలుచుకొంది. అదే జిల్లాలో శంషాబాద్ మునిసిపాలిటీ పరిధిలో 4వ వార్డు స్వతంత్ర అభ్యర్ధి విజయం సాధించారు. ఇక వరంగల్ రూరల్ జిల్లాలో వర్ధన్నపేటలో కాంగ్రెస్-2, బిజెపి-1, స్వతంత్ర అభ్యర్ధి-1 స్థానం గెలుచుకొన్నారు.
ఇక టిఆర్ఎస్ విషయానికి వస్తే..
సిరిసిల్లాలోని 40 వార్డులలో నాలుగు, వేములవాడలో 28వ వార్డు, మేడ్చల్ జిల్లా జవహార్నగర్ కార్పొరేషన్ పరిధిలో అలగిరిచిత్ర డివిజన్, పరకాలలో 22 వార్డులలో 11, సూర్యాపేటలోని 48 వార్డులలో ఒకటి, వరంగల్ రూరల్లో 2, అదే జిల్లాలోని వర్ధన్నపేటలో 12 వార్డులలో 8, సంగారెడ్డి జిల్లా బొల్లారంలోని 22 వార్డులలో 3, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 1, జగిత్యాల జిల్లాలోని 48 వార్డులలో 3, అదే జిల్లాలో ఎల్లారెడ్డిలోని 12 వార్డులలో 4 స్థానాలలో టిఆర్ఎస్ అభ్యర్ధులు విజయం సాధించారు.