హైదరాబాద్‌ తిరుగుప్రయాణమైన కేటీఆర్‌

January 24, 2020


img

తెలంగాణ ఐ‌టి, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్‌, ఆయన బృందం నాలుగు రోజుల దావోస్‌ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ తిరుగుప్రయాణం అయ్యారు. ప్రపంచఆర్ధికసదస్సులో పాల్గొన్నవారు రాష్ట్రానికి పెట్టుబడులు, కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు గట్టిగా కృషి చేశారు. వారి ప్రయత్నాలు ఫలించి పెరిమాల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పెరిమాల్ తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడేళ్ళలో రూ.500 కోట్లు పెట్టుబడితో ఫార్మా కంపెనీను ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ఇంకా మరికొన్ని అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను స్వయంగా పరిశీలించుకొనేందుకు త్వరలో హైదరాబాద్‌ రానున్నారు. 

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌ తిరిగివచ్చేసరికి రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతుంటాయి. సోమవారం నుంచి మేయర్లు, మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమాలు మొదలవుతాయి కనుక కేటీఆర్‌ మళ్ళీ రాజకీయాలతో బిజీ అయిపోతారు.


Related Post