బాలయ్యతో రోజా సెల్ఫీ!

January 23, 2020


img

వైసీపీ ఎమ్మెల్యే రోజా టిడిపి అధినేత చంద్రబాబునాయుడుపై నిత్యం తీవ్రవిమర్శలు గుప్పిస్తూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాలలో కూడా ఆమె చంద్రబాబునాయుడును కడిగేస్తూనే ఉన్నారు. కనుక టిడిపి నేతలందరూ ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉండటం సహజం. అయితే నిన్న ఏపీ శాసనమండలిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. 

టిడిపి ఎమ్మెల్యే, చంద్రబాబునాయుడు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణతో రోజా సెల్ఫీలు తీసుకొన్నారు. ఆమెతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా బాలకృష్ణతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఆ సమయంలో బాలకృష్ణకు కొద్ది దూరంలోనే చంద్రబాబునాయుడు కూడా కూర్చొని ఉన్నారు. 


ఏపీ శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో మూడు రాజధానుల బిల్లుపై సభలో ఏవిధంగా చర్చ జరుగుతుందో చూసేందుకు చంద్రబాబునాయుడు, బాలకృష్ణ, టిడిపి, వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చోన్నారు. అప్పుడు పక్కనే ఉన్న బాలకృష్ణను రోజా ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ తీసుకొన్నారు. ఆ తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయనతో సెల్ఫీలు తీసుకొన్నారు. ఈ సెల్ఫీల గురించి చంద్రబాబునాయుడు, సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏమనుకొంటున్నారో? 


Related Post